Tamil Actor Rajesh Passed Away At 75: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు రాజేష్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం ఆయనకు ఛాతి నొప్పి, బ్రీథింగ్ సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్త చేస్తున్నారు.
తమిళ పరిశ్రమ గొప్ప నటుడిని కొల్పోయిందంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు సూపర్ స్టార్ రజనీకాంత్, నటి రాధిక శరత్ కుమార్లు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. కాగా నటుడు రాజేష్ రజనీకాంత్కు మంచి స్నేహితుడు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని రజనీ ఎమోషనల్ అయ్యారు. “నా ప్రియ మిత్రుడి అకాల మరణ వార్త నన్నేంతో బాధించింది. ఆయన లేరని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా హృదయం తీవ్ర వేదనతో బరువెక్కింది. ఎంతో గొప్ప వ్యక్తి.. మంచి మనిషి.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా” అంటూ ఆయన ట్విటర్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు.
என்னுடைய நெருங்கிய நண்பர், நடிகர் ராஜேஷ் அவர்களின் அகால மரணச் செய்தி எனக்கு அதிர்ச்சியளிக்கிறது. மிகுந்த மன வேதனையைத் தருகிறது.
அருமையான மனிதர், அவருடைய ஆத்மா சாந்தியடையட்டும்.
அவருடைய குடும்பத்தினருக்கும், நண்பர்களுக்கும் என்னுடைய ஆழ்ந்த அனுதாபங்கள்.#ActorRajesh
— Rajinikanth (@rajinikanth) May 29, 2025
రాజేష్ ఎంతో మంచి నటుడు. అలాంటి గొప్ప నటుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన మరణ వార్త విని షాక్కు గురయ్యాను. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. సినిమా మీద ఆయనకు ఉన్న ప్రేమ, అమితమైన జ్ఞానం ఆయనపై మరింత గౌరవాన్ని పెంచింది. సినిమా ఉన్నంత కాలంగా ఆయనను మిస్ అవుతూనే ఉంటాయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి కలగాలని ఆ దేవుడని ప్రార్థిస్తున్నా” అంటూ నటి రాధిక ట్వీట్ చేశారు. కాగా తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు రాజేష్. రజనీకాంత్ వంటి ఎంతో స్టార్ హీరో చిత్రాల్లో సహానటుడి పాత్రలు పోషించారు. నటుడుగానే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా, రైటర్గా కూడా రాణించారు.
వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన గొప్ప నటుడిగా తనకంటూ ముద్ర వేసుకున్నారు. ఐదు దశాబ్దాల కాలంలో ఆయన 150పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై, బుల్లితెరపై ఎంతోమంది అభిమానాన్ని పొందిన ఆయన ‘అవల్ ఒరు తొడరకథై’ (1974) అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కన్ని పరువతిలే వంటి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. డబ్బింగ్ చిత్రాలతో ఆయన తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు సైతం సుపరితమే. తనదైన నటనతో ఎన్నో చిత్రాలతో మంచి గుర్తింపు సాధించిన ఆయన సినిమాల నుంచి బ్రేక్ ఇచ్చి వ్యాపారం రంగంలోకి వెళ్లారు. చెన్నైలో సొంతంగా హోటల్స్ ప్రారంభించారు. రియల్ ఎస్టేట్లో వ్యాపార రంగంలోనూ బాగా రాణిస్తున్న ఆయన అకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి.