Preity Zinta Donates Rs 1.1 Crore to Indian Army: బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింటా తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇండియన్ ఆర్మీకి ఆమె భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధిలోని తన వాటా నుంచి రూ.1.10 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. దీంతో ప్రీతి జింటాపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రాంతీయ అధ్యక్షుడు, సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్ నిర్వహించిన శప్తా శక్తి కార్యక్రమానికిన నిర్వహంచారు.
దీనికి ఆర్మీ కుటుంబాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రతీ జింట్లా హాజరైన సందర్భంగా ఈ మొత్తాన్ని ఆమె విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. సాయుధ బలగాల కుటుంబాలకు అండగా నిలవడం మన బాధ్యతని, మన సైనికులు చేసిన త్యాగాలకు తగు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేమన్నారు. కానీ, మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి సపోర్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు.
సైనిక వీరుల నారీమణుల సాధికారతకు, వారి పిల్లల చదువు కోసం రూ. 1.10 కోట్ల మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ఆమె చెప్పారు. దీంతో ప్రీతి జింటా గొప్ప మనసుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. తెలుగులో ఆమె రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాలు తగ్గించి వ్యాపారంలో యాక్టివ్గా ఉంటున్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజ్ పంజాబ్ కింగ్స్ టీంకి కో-ఓనర్గా వ్యవహరిస్తున్నారు.