Jayam Ravi Wife Blames Third Person for Their Broken Marriage: కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) విడాకులు వ్యవహరం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహరంలో కుటుంబ సభ్యులు ఒకరపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సుధీర్ఘ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. జయం రవి, గాయనీ కెన్నిషాతో రిలేషన్ ఉన్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయన భార్య ఆర్తి రవి కూడా అవును అన్నట్టునే తరచూ పరోక్ష కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటిని జయం రవి కొట్టిపారేశాడు.
కానీ ఇటీవల ఓ పెళ్లికి కార్యక్రమానికి జయం రవి, కెన్నిషాలు జంటగా హాజరయ్యారు. దీంతో అతడి భార్య.. ఓ సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. ఇంతకాలంగా ఎన్ని ఆరోపణలు వచ్చిన మౌనంగా భరించానంది. అంత మాత్రాన తాన వద్ద ప్రూఫ్స్ లేవని కాదు, ఆ ఆరోపణలు స్వీకరించినట్టు కాదంది. ఇప్పుడు అసలు విషయం ఏంటన్నది అందరికి తెలిసిందని, ఇంతకాలంగా నా పిల్లలను చూసి మౌనంగా ఉన్నానంది. ఆ తర్వాత తన భర్త నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేదని, పిల్లలను కూడా పట్టించుకోవడం లేదని తన పోస్ట్లో చెప్పుకొచ్చింది.
ఆ వెంటనే కొన్ని రోజులకు జయం రవి భార్యపై ఆరోపణలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్తి తనని ఎన్నో విధాలకు ఇబ్బందులు పెట్టింది, ఆఖరికి ఆర్థిక కంగా ఎన్నో అవమానాలు చేసిందన్నాడు. అన్ని విదాలు మనసు విరిగిపోయి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న తనగా కెన్నిషా అండగా నిలిచిందన్నాడు. రవి పోస్ట్ చేసిన అనంతరం ఆయన అత్తమ్మ, ఆర్తి తల్లి.. నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూడా ఓ పోస్ట్ పెట్టారు. జయం రవి ఎన్నో అబద్ధాలు చెబుతున్నాడని, అందులో నిజం లేదన్నారు. తన కోసం రూ. 100 కోట్లు అప్పు చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
మా విడాకులకు మూడో వ్యక్తి కారణం
ఈ క్రమంలో జయం రవి భార్య ఆర్తి రవి మరో పోస్ట్ పెట్టారు. తాము విడిపోవడానికి కారణం డబ్బు, పవర్ కాదని స్పష్టం చేసింది. మూడో వ్యక్తి వల్లే తాము విడిపోయామని పేర్కొంది. “ఈ విషయాన్ని నేను ఊహించి చెప్పడం లేదు. ఇది నిజం చెప్పడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి” అని ఆమె చెప్పింది. కాగా భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తనని సంప్రదించకుండానే ఆయన విడాకులు ప్రకటన చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వారిద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణ దశలో ఉంది.