Jayam Ravi Wife Aarti Demands Rs 40 Lakh Alimony: విడాకులు కేసు విచారణ కోసం తమిళ నటుడు ‘జయం’ రవి, ఆయన భార్య ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్డు ముందు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించినట్టు సమాచారం. కాగా గత కొన్ని రోజులు జయం రవి, ఆయన భార్యకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఈ వ్యవహరం రోజురోజుకు ముదురుతుండటంతో ఇద్దరు ఇవాళ ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. తన భార్యతో బంధాన్ని కొనసాగించలేనని, విడాకులు ఇప్పించాలని జయం రవి జడ్జీ ముందు చెప్పారు. ఈ మేరకు విడాకులు మంజూరు చేయాలని అతడి లీగల్ టీమ్ న్యాయస్థానాన్ని కోరినట్టు తెలిసింది. ఇక భర్త విడాకులు కోరడంతో ఆయన భార్య ఆర్తి భరణం డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో ఆమె తన భర్త జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షలు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఇక ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది. కాగా గతేడాది తన భార్య ఆర్తితో విడిపోతున్నట్టు జయం రవి సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. దీనిపై స్పందించిన ఆర్తి.. ఈ విషయంలో తన నిర్ణయం, అభిప్రాయం తీసుకోకుండానే తన భర్త ప్రకటన చేశాడని ఆరోపించింది. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ వరుస ట్వీట్స్ చేశారు. ఆ సమయంలో వీరి విడాకులు వ్యవహరం ఇది హాట్టాపిక్గా మారింది. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
ఇక ఇటీవల జయం రవి రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ అయిన సింగర్ కెన్నీషాతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరుకావడంతో మరోసారి జయం రవి-ఆర్తి విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పుడు తాను ప్రశాంతంగా ఉన్నానని, పంజరం నుంచి బయటపడ్డట్టు ఉందని పోస్ట్లో పేర్కొన్నాడు. ఇక వారి వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి డబ్బు, గొడవలు కారణం కాదపి, మూడో వ్యక్తి వల్లే అంటూ ఆమె ఓ పోస్ట్ వదిలారు. దీనికి అన్ని ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని ఆర్తి తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఆమె ఈ పెట్టి 24 గంటల కూడా కాకముందే.. వీరి కేసు విచారణకు రావడం గమనార్హం.