Prime9

JVAS Re-Release: JVAS రీ-రిలీజ్‌ – ఆ ఉంగరం, చేప ఏమైంది?.. చిరంజీవితో రామ్‌ చరణ్‌

Jagadeka Veerudu Athiloka Sundari Rerelease: మెగాస్టార్‌ చిరంజీవి, లేడీ సూపర్‌ స్టార్‌, దివంగత నటి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’. వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్‌ నిర్మించిన ఈ సినిమా అప్పటల్లో టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు అవుతున్ సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. మే 9న ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది.

 

ఈ నేపథ్యంలో మూవీ హీరో చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్‌లతో యాంకర్‌ సుమ ప్రత్యేక ఇంటర్య్వూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారంత మూవీ విశేషాలను, మేకింగ్‌ విషయంలో ఎదురైన సవాళ్లు.. రాజుగా చిరు పాత్ర, అతిలోక సుందరి శ్రీదేవి మేకోవర్‌, నటనపై ఇలా ఎన్నో విశేషాలను ఈ సందర్భంగా పంచుకుంది మూవీ టీం. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సుమ మానవ మానవ అంటూ శ్రీదేవి పాత్రలో లీనమైంది.

 

అప్పుడే లోపలికి వస్తున్న చిరంజీవి.. 35 ఏళ్లయిన నువ్వు మానవ అనడం మానవా? చంపేస్తున్నావ్‌ అంటూ ప్రశ్నిస్తూ లోపలికి వస్తారు. అక్కడ దర్శకుడు రాఘవేంద్రరావు, అశ్వినీ దత్‌లను చూసి ఆశ్చర్యపోతుంటారు. వచ్చిరాగానే సుమను ఆటపట్టిస్తారు చిరు. ఈ సినిమా కథ ఎలా తట్టిందని రాఘవేంద్రరావుని అడుగుతుంది సుమ. అప్పుడ ఆయన మొట్టమొదట ఈ సినిమా ఒప్పుకున్న దత్‌ గారిని ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటారు.

The Magical Reunion |Promo| #JagadekaVeeruduAthilokaSundari | Chiranjeevi, AswiniDutt,RaghavendraRao

 

అలా వారంత సినిమా విశేషాలను పంచుకుంటుండగా.. చివరిలో రామ్‌ చరణ్‌ ఎంట్రీ ఇస్తారు. వీడియో కాల్‌ ద్వారా ఈ సినిమా విషయంలో తనకు ఉన్న సందేహన్ని బయటపెడతాడు. అసలు ఆ రింగ్‌ ఏమైంది? ఆ చేప ఏమైంది? 30 సంవత్సరాలు అయిపోంది.. దీనికి సమాధానం ఒక్కరే చెప్పగలుగుతారంటూ రామ్‌ చరణ్‌ వ్యాఖ్యలతో ఈ ప్రొమో ఎండ్‌ అయ్యింది. ప్రస్తుతం వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ఇక పూర్తి ఎపిసోడ్‌ మే 9న ప్రసారం కానుంది.

Exit mobile version
Skip to toolbar