Site icon Prime9

SS Rajamouli: ఆ అమ్మాయి కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు – రాజమౌళిపై ఆయన స్నేహితులు సంచలన ఆరోపణలు

Allegations On SS Rajamouli: స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళిపై ఆయన స్నేహితులు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్‌ మూవీ నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌ రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహ బంధం ఉందన్నారు. అయితే కొంతకాలంగా జక్కన్న తనని టార్చర్‌ చేస్తున్నాడని, అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌ అవుతోంది. ఈ మేరకు సూసైడ్‌ నోట్‌తో పాటు సెల్ఫీ వీడియోను షేర్‌ చేశారు. ఇంతకి ఇందులో ఆయన ఏమన్నారంటే ఆర్య 2లాగే తమ జీవితంలో ఓ అమ్మాయి ఉందని, ఆమె కోసం రాజమౌళి తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ఆరోపించారు.

“భారతదేశంలోనే టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. పబ్లిసిటీ కోసం నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. ఎమ్‌ ఎమ్‌ కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్ర శేఖర్ యేలేటి, హను రాఘవపూడి, మైత్రీ మూవీస్‌ ఇలా చాలామందితో కలిసి నేను పనిచేశాను. వీళ్లందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులం. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాం. కానీ, ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్‌లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం.. ఆ తర్వాత నాతో కూడా స్నేహం.

మా ఇద్దరి జీవితాల్లో ఒక మహిళ ఉంది

ఆర్య2 సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్‌ కాబట్టి ఏం చేద్దాం అంటూ నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే నన్ను కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నలుగురం కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఈ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పాను. ఇదంతా జరిగింది శాంతినివాసం సీరియల్‌ కంటే ముందు జరిగింది. రాజమౌళి కోసం నా 34 ఏళ్ల కెరీర్‌ని త్యాగం చేసినందుకు నన్ను టార్చర్‌ పెట్టడం మొదలుపెట్టాడు.

నరకం చూపిస్తున్నాడు

అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్‌గా ఉండిపోయాను. కొద్దిరోజుల పాటు నాతో రాజమోళి బాగానే ఉన్నాడు. అయితే, స్టార్‌ డైరెక్టర్‌గా రాజమౌళి ఎదిగాడు. ఇప్పుడు నెం.1 డైరెక్టర్‌ అయ్యి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు కాబట్టి నన్ను చంపేంతా టార్చర్‌ పెట్టడం మొదలు పెట్టాడు. ఎవరికైనా చెప్పానేమోనని నన్ను వేధింపులకు గురి చేశాడు. ఒక రోజు ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మన స్టోరీని సినిమాగా తీస్తానని అన్నందుకు అప్పటి నుంచి నన్ను టార్చర్‌ పెడుతున్నాడు. వాడి పిల్లలను కూడా నేను పెంచాను. కార్తికేయ, భైరవలు రాజమౌళి లాగే నన్ను కూడా బాబా అని పిలుస్తారు. కానీ కొద్ది రోజులుగా రాజమౌళి నాకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నాడు. నేను సింగిల్‌. పెళ్లి, పిల్లలు లేరు. అందుకే ఇక నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. నాకు ఇప్పుడు 54 ఏళ్ల వయసు. సింగిల్‌గానే ఉంటున్నా. రాజమౌళి వల్ల నా జీవితం నాశనం అయ్యింది. అయితే ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అనేవి ఏం ఉండవు. మా ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది తెలియాలంటే ఎవరైనా లైవ్‌ డిటెక్టివ్‌ పెట్టాలి. రాజమౌళి యమదొంగ సినిమాకు కూడా నేను వర్క్‌ చేశాను. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా యు శ్రీనివాస్‌ అని నా పేరు కూడా వస్తుంది. ఇది నా మరణ వాగ్ములనం” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version
Skip to toolbar