Alekhya Chitti Pickles Sister Gets Movie Chance: ‘అలేఖ్యా చిట్టి పికిల్స్’ సోషల్ మీడియాలో ఈ పేరు ఎంతటి సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది తెలియాలంటే ‘మినిమం డిగ్రీ చేసుండాలి’ అనేది బాగా వైరల్ అయ్యింది. పచ్చడ బిజినెస్తో వీరు షేర్ చేసే రీల్స్ నెట్టింట తెగ హల్చల్ చేశాయి. వాట్సాప్ చాట్, ఫోన్ సంభాషణ బాగా వైరల్ అవ్వడంతో ఈ పికల్స్ సిస్టర్స్ బాగా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అలేఖ్యా చిట్టి పికిల్స్పై మీమ్స్,వీడియోలు తెగ హల్చల్ చేశాయి. పచ్చళ్ల బిజినెస్ మూతపడిన వీరి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
అయితే అలేఖ్యా సిస్టర్స్లో ఒకరైన రమ్య సడెన్గా ఓ సినిమా ఈవెంట్స్లో దర్శనం ఇచ్చింది. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’. తాజాగా ఈ మూవీ టీజర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్లో రమ్య సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె మూవీ ఈవెంట్లో కనిపించడంపై నెటిజన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. పచ్చళ్ల బిజినెస్తో ఫేమస్ అయ్యి.. ఏకంగా సినిమాల్లోనే ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. మొత్తానికి రమ్య మూవీ ఈవెంట్ కనిపించడంతో మరోసారి అలేఖ్యా చిట్టి పికిల్స్ హాట్ టాపిక్గా మారాయి.