Santhanam gets Legal Notice: తమిళ నటుడు సంతానంకు నోటీసులు ఇచ్చారు. శ్రీనివాస.. గోవిందా భక్తి గీతాన్ని పేరడి చేసి హిందువుల మనోభవాలు దెబ్బతిశారంటూ ఆయనపై తిరుపతికి చెందిన బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నటుడు సంతానంకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అతడు ప్రధాన పాత్రలో ‘డేవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్’ అనే సినిమా తెరకెక్కింది. రేపు ఈ సినిమా విడుదల కానుంది. అయితే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన పాటపై హందు సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
ఇందులో ‘పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా’ అంటూ శ్రీనివాస గోవిందా పాటను పేరడి చేశారు. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అయితే ఈ వివాదంపై ఇటీవల ప్రెస్మీట్లో హీరో సంతానం స్పందిస్తూ.. ఈ విషయంలో ఎవడికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అతడు ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే బీజేపీ నేత సంతానపం, మూవీ టీంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి గీతాన్ని డీడీ నెక్ట్స్ లెవల్లో సినిమాలో వాడి భక్తుల మనోభవాలు దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు తిరుమల, తిరుపతిలోని పలు పోలీసు స్టేషన్లో సంతానంపై బీజేపీ, జనసేన నేతలు ఫిర్యాదులు చేశారు. అలాగే తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ చిత్ర విడుదలను నిషేధించాలని, ఆ సినిమాలో వాడిన భక్తి గీతాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస గోవిందా.. భక్తి గీతాన్ని పేరడి చేసి భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు నష్ట పరిహారంగా రూ. 100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నటుడు సంతానం, నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులో హెచ్చరించారు.