Tirumala: 30న తిరుమలకు వెళ్లే వాహనాలకు నో ఎంట్రీ

తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు చేరుకొనే భక్తులకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు

Tirumala: తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు చేరుకొనే భక్తులకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అక్టోబర్ 1వ తేది గరుడ వాహన సేవను పురస్కరించుకొని ముందు రోజు (ఈ నెల 30న) నుండి తిరుమలలో ప్రవేశించేందుకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేసారు.

పరిస్ధితిని బట్టి కార్లకు కూడా అనుమతి ఉండకపోవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. భక్తులు తమ వాహనాలను తిరుపతిలోనే పార్క్ చేసుకోవాలని సూచించారు. ఆర్టీసి బస్సుల ద్వారా తిరుమలకు చేరుకోవాలని ఆయన భక్తులకు విజ్నప్తి చేశారు.

ఇది కూడా చదవండి:

BJP leader Ravikumar: నోటు పుస్తకాలు పంపిణీ చేసిన భాజపా నేతలు