Minor Girl Raped in Peddapalli District : షాకింగ్.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆరేళ్ల బాలికపై హత్యాచారం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ దర్మార్గుడు. కాట్నపల్లి మమత రైస్‌మిల్‌లో ఈఘటన చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - June 14, 2024 / 01:53 PM IST

Minor Girl Raped in Peddapalli District : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ దర్మార్గుడు. కాట్నపల్లి మమత రైస్‌మిల్‌లో ఈఘటన చోటు చేసుకుంది. యూపీకి చెందిన కూలీ బలరాం బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీపుటేజీలో రికార్డ్‌ అయ్యాయి. దీంతో అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బలరాంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

బాలికను ఎత్తుకుపోయి..(Minor Girl Raped in Peddapalli District)

బాలిక తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తుండగా బలరాం బాలికను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి నిద్ర లేచి చూసేసరికి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బాలిక కోసం వెతకగా సమీపంలోని పొదల్లో మృతదేహం కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సుల్తానాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.బాలికను బలరాం తన భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న దృశ్యం రైస్‌మిల్లు ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. నిందితుడు మరో రైసు మిల్లలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.