PM Modi Released AP Workers Upadi Hami Pathakam Money: ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలను మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. మే నెల శ్రామికుల వేతనాలు నిలిచిపోవడంతో.. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏకంగా వేయి కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ డబ్బులు శ్రామికుల అకౌంట్లో రెండు లేదా మూడు రోజుల్లో జమకానుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇంకా 11వందల కోట్లు రావాల్సి ఉంది. మరో 2వేల 5వందల కోట్లు మెటీరియల్ నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో విడుదల కానున్నాయి. అయితే ప్రస్తుతానికి కార్మికుల జీతాలు మాత్రం రెండు మూడు రోజుల్లో పడబోతున్నాయి. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.