Special puja performed in Prayagraj for India vs Pakistan match: దాయాదుల మ్యాచ్ అనగానే క్రికెట్ ఫ్యాన్స్లో ఉత్కంఠ ఉండడం సహజమే. చాలా రోజుల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, భారత్ గెలవాలని క్రికెట్ అభిమానులు దేశ వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. కొంతమంది నది ఒడ్డున చేసిన పూజల వీడియోలు, ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
India vs Pakistan: దాయాదుల మ్యాచ్.. భారత్ గెలవాలని మహాకుంభమేళాలో ప్రత్యేక పూజలు!
