Kidambi Srikanth Missed Malaysia Masters Trophy: మలేసియా మాస్టర్స్ టైటిల్ పోరులో భారత్ కు నిరాశ ఎదురైంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా సాగిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్ లో ఓటమి పాలయ్యాడు. ఇవాళ జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్ లో శ్రీకాంత్ 11-9, 21-9 తేడాతో చైనా ఆటగాడు లీ షిఫెంగ్ చేతిలో ఘోర పరాజయం పొందాడు. చైనా ఆటగాడికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. కేవలం 36 నిమిషాల్లోనే రెండు గేములు కోల్పోయి రన్నరప్ గా నిలిచాడు. ఫైనల్ కు ముందు వరుసగా ఐదు మ్యాచ్ లు నెగ్గి జోరుమీద కనిపించిన శ్రీకాంత్ కు తుది పోరులో ఎదురుదెబ్బ తగిలింది.
కాగా 2017లో శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు. తర్వాత మరో టైటిల్ సాధించలేదు. ఇక 2019లో ఇండియా ఓపెన్ లో ఫైనల్ చేరుకున్నా.. అక్కడ కూడా ఓటమి చవిచూశాడు. మళ్లీ ఆరేళ్ల తర్వాత మలేసియా మాస్టర్స్ ఓపెన్ సిరీస్ లో ఫైనల్ కు వెళ్లిన శ్రీకాంత్ కు మళ్లీ నిరాశే ఎదురైంది.