Shubman Gill as a Test Captain for England Tour: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. టెస్ట్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా పలువురు ఆటగాళ్ల పేర్లు తెరపైకి వచ్చినా.. గిల్ వైపే బీసీసీఐ మొగ్గుచూపింది. దీంతో టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇక వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలక్ట్ చేసింది. అలాగే జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు 18 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించింది.
ఇక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టులో శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేసింది.