PM Kisan 19th Installment Rs 22,000 Cr To Be Released Today: రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకం కింద అందించే నిధులను ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో విడుదల కానుంది. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు అందిస్తుంది.
అయితే, ఈ పథకం 2019లో ప్రారంభం కాగా, ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు చెల్లించారు. అంతకుముందు తొలి విడతలో రూ.6,324.24 కోట్లతో ఈ ప్రారంభం కాగా, 18వ విడతలో రూ.20,665.17 కోట్లకు చేరింది. ఈ పథకం కింద 18వ విడతలో తెలంగాణలో 30,77,426 మందికి 627.46 కోట్లు విడుదల చేయగా.. ఏపీలో 41,22,499 మందికి రూ.836.31 కోట్లు విడుదల చేశారు.