Prime9

Tamilnadu: భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. విరుదాచలం ఆలయానికి కొందరు భక్తులు సముహాంగా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. కాగా స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar