Telangana ECET 2025 Results Out Now Check Here: తెలంగాణ ఈసెట్- 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్, బీస్సీ మ్యాథ్స్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12న ఈసెట్ ఎంట్రెన్స్ నిర్వహించారు. మొత్తం 18,928 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 96.22 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో ఓయూ వీసీ కుమార్, ఉన్నత విద్యామండలి సభ్యులు, ఓయూ యూనివర్శిటీ అధికారులు పాల్గొన్నారు. ఫలితాల్లో టాప్ లో అమ్మాయిలు, అబ్బాయిలు సత్తా చాటారు.
వివిధ విభాగాల్లో ఫస్ట్ ర్యాంకర్స్
* బీఎస్సీ మ్యాథ్స్- సంతోష్ కుమార్
* కెమికల్ ఇంజనీరింగ్- లెంక తేజ సాయి
* సివిల్ ఇంజనీరింగ్- నిఖిల్ కౌశిక్
* కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్- శ్రీకాంత్
* ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- కట్లే రేవతి
* ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- కాసుల శ్రావణి
* ఎలక్ట్రానిక్స్, ఇన్స్ర్టుమెంటేషన్ ఇంజినీరింగ్- రాపర్తి చందన
* మెకానికల్ ఇంజనీరింగ్- పోతుగంటి కార్తీక్
* మెటలర్జికల్ ఇంజనీరింగ్- తోట సుబ్రహ్మణ్యం
* మైనింగ్ ఇంజనీరింగ్- కుర్మా అక్షయ
* ఫార్మసీ- ఐలి చందన