Site icon
Prime9

Raja Singh : కవిత మాట్లాడింది నిజమే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh

Raja Singh

BJP MLA Raja Singh’s sensational comments : గులాబీ పార్టీపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీలో బీఆర్‌ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని తేల్చిచెప్పారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు కూడా బీజేపీని బీఆర్ఎస్‌లో విలీనం చేసేవారని కామెంట్స్ చేశారు. ఒకవేళ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ వాళ్లే ప్రకటిస్తారని తెలిపారు. గతంలో కూడా ఇదే జరిగిందని, అందుకే బీజేపీ నష్టపోయిందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉందని, కానీ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు.

 

ప్రతీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కైయ్యారని రాజాసింగ్ ఆరోపించారు. దీంతో బీజేపీ చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం బీజేపీ కార్యకర్తలకు తెలుసని, అయినా ఎవరూ బయటపడరన్నారు. విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే సస్పెండ్ చేస్తారనే భయంతో ఉన్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ లేఖను విడుదల చేశారు.

 

సొంత పార్టీపై విమర్శలు చేయడం రాజాసింగ్‌కు కొత్త కాదు. గతంలో కూడా పార్టీపై విమర్శలు చేశారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికార పార్టీకి తొత్తులుగా మారేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో చేతులు కలుపుతూ రాష్ట్ర నాయకుల్లో కొంతమందికి అలావాటైందన్నారు. పాత స్క్రాబ్‌ను తీసివేస్తే తప్ప పరిష్కారం లభించదంటూ గతంలో రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.

 

తాజాగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందంటూ కామెంట్స్ చేశారు. దీనిపై రాజాసింగ్ మాట్లాడారు. కవిత వ్యాఖ్యలకు మద్దతునిచ్చారు. కవిత వ్యాఖ్యలు నిజమేనని భావిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. కవితకు సంబంధించి విషయాలపై ఎవరూ మాట్లాడటానికి వీలులేదని, ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదన్నారు. జాతీయ నాయకత్వం దృష్టికి వెళుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజాసింగ్ చేసి వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version
Skip to toolbar