Site icon Prime9

Khammam: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న లారీ

lorry collision with bus in khammam

lorry collision with bus in khammam

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా..  డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బస్సు డ్రైవర్‌ను బయటకు తీశారు. డ్రైవర్‌తో పాటు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు తెలిపారు.

 

ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను  హాస్పిటల్ కు చేర్చారు. ఎవరికీ ప్రాణాపాయం జరుగలేదు. బస్సు డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. గంటన్నర శ్రమించి అతన్ని బయటకు తీశారు స్థానికులు. బస్సును లారీ అత్యంత వేగంగా ఢీకొట్టడంవలనే క్యాబిన్ లో డ్రైవర్ ఇక్కున్నట్లు ప్రయాణికులు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే లారీడ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు. దీంతో కిలోమీటరుకుపైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పక్కకు తరలించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version
Skip to toolbar