Prime9

Konda Surekha: మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, ఇతర మంత్రుల్లా లంచం తీసుకోనన్నారు

 

Konda Surekha: మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర మంత్రుల లాగా ఫైల్ క్లియర్ చేసేందుకు తాను డబ్బులు తీసుకోనని అన్నారు. తన దగ్గరికి ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఎవరు వచ్చినా.. ఏమీ ఆశించనన్నారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

అరవింద ఫార్మా వారు పనుల కోసం తన వద్దకు వచ్చినప్పుడు తనకు ఇతర మంత్రుల లాగా కమిషన్ అవసరం లేదని.. తనకు ఇచ్చే డబ్బులతో ప్రభుత్వ కళాశాల భవనం నిర్మించాలని సూచించానని తెలిపారు. అరవిందో ఫార్మా వారికే భవన నిర్మాణ పనులు అప్పగించామని.. ప్రభుత్వం తరఫున నిర్మిస్తే క్వాలిటీ తోపాటు నిర్మాణం ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం కొండా సురేఖ దేవాదాయ శాఖ అటవీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

 

కొండ సూరేఖ ఇప్పటికే తన నోటి దురుసుతో అక్కినేని కుటుంబంపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకుగాను హీరో నాగార్జున ఆవిడపై పరువునష్టం కేసును కూడా వేశాడు. ప్రస్తుతం కేసు నాంపల్లి కోర్టులో నడుస్తోంది. సమంత విషయంలో కొండ సురేఖ చేసిన వ్యాఖ్యాలకు సినీ ఇండస్ట్రీ మండిపడింది. యావత్ ఇండస్ట్రీ సమంతకు అండగా ఉంది. తాజాగా తోటి మంత్రులపై సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. వ్యాఖ్యలు చేసిన అనంతరం తాను అలా అనలేదని అన్నారు. అయితే కేసును మాత్రం నాగార్జున వెనక్కి తీసుకోలేదు.

Exit mobile version
Skip to toolbar