Prime9

KCR: కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ మరోసారి ఆర్థిక సాయం

Breaking News: KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. వైద్యవిద్యలో ఆసక్తి కనబరిచిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. పీజీ చేస్తున్న ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని కేసీఆర్ కిష్టయ్య భార్యా, పిల్లలకు అందించారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar