BJP MLA Raghunandan Rao Sensational Comments on MLC Kavita: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా?.. ఆస్తుల పంచాయితీనా? అని ప్రశ్నించారు. కవిత చెప్పినా.. చెప్పకున్నా.. తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రఘునందన్ రావు. కవితను బయటకు పంపించడం కోసం.. బావ, బావమరిది ఒక్కటి అయ్యారు అనే సంకేతం మీటింగ్ ద్వారా ఇచ్చారన్నారు. కవిత ..మరో షర్మిల కాబోతున్నట్లు కనిపిస్తోందని రఘునందన్ చెప్పారు. కాంగ్రెస్లోకి కవిత వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయన్నారు. సీఎం ఈ డ్రామా వెనుక ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.