Telangana IAS Ronald Rose: ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్కు భారీ ఊరట లభించింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రోనాల్డ్ రాస్ కూడా ఉన్నారు. అయితే, రోనాల్డ్ రాస్ మాత్రం మళ్లీ క్యాట్ను ఆశ్రయించడంతో తాజాగా, క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.