Prime9

Amaravati: అమరావతిలో ప్రధాని పర్యటన, ట్రాఫిక్ మళ్లింపులు

Amaravati:  ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపధ్యంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి రానున్నాయి.  అమరావతి చుట్టుప్రక్కల ఏపీ ట్రాఫిక్ పోలీస్ శాఖ ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించింది.

 

చెన్నై వైపు నుండి విశాఖపట్నంనకు వయా విజయవాడ మీదుగా.. చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరి పేట నుండి NH-16 మీదుగా మళ్లించారు. చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నవ గ్రామం మీదుగా డైవర్ట్ చేశారు.

 

గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలును బుడంపాడు క్రాస్ మీదుగా.. గన్నవరం వైపు నుండి హైదరాబాద్‌కు వయా ఆగిరిపల్లి.. విశాఖపట్నంనుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలని సూచించారు.

 

శుక్రవారం మధ్యాహ్నం 3.25 నుంచి 4.45 గంటల వరకు ప్రధాని పర్యటన జరగనుంది. సభ వేదికపై 14 మంది ఆసీనులవుతారు. మొదట మంత్రి నారాయణ స్వాగతోపన్యాసం చేయనున్నారు. రాజధాని డెవలప్మెంట్ గురించిన పూర్లి సమాచారంపై సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రధాని స్పీచ్ తర్వాత అమరావతి పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించేలా A ఆకారంలో పైలాన్ ఉండనుంది. పైలాన్‌పై  ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు ఉండనున్నాయి.

Exit mobile version
Skip to toolbar