12 thousand Crores Loan Deal with Foreign Banks for AP Metro Train Projects: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక అడుగు పడింది. మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి పలు విదేశీ బ్యాంకుల, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేఎఫ్ డబ్ల్యూ, ఏఎఫ్ డీ, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే విజయవాడ కేంద్రంలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను విదేశీ బ్యాంకుల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
ఇదిలా ఉండగా, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.5,900 కోట్లు రుణ ఒప్పందంతో పాటు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.6,100 కోట్ల రుణ ఒప్పందంపై ముందడుగు వేశాయి. కాగా, తక్కువగా వడ్డీకి రుణాలు అందించే బ్యాంకులతో ఎండీ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిదులు సంప్రదింపులు జరిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.