Site icon Prime9

Teacher MLC: టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గోపీ మూర్తి విజయం

Gopi Murthy won in Teacher MLC elections: ఏపీలోని కాకినాడ జేఎన్డీయూలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈ బైఎలక్షన్‌లో యూటీఎఫ్ అభ్యర్ధి గోపీ మూర్తి విజయం సాధించారు. ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ పోటీలో ఐదుగురు అభ్యర్థులు నిల్చున్నారు. ఇందులో గంధం నారాయణరావు, దీపక్ పులుగు, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంటకలక్ష్మి, బొర్రా గోపీమూర్తి ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన గోపీ మూర్తి.. రెండేళ్ల 2 నెలలపాటు పదవిలో కొనసాగనున్నారు. అయితే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఉపఎన్నిక నిర్వహించారు.

అంతకుముందు జేఎన్టీయూలోని అంబేద్కర్ కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ షాన్మొహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. మొత్తం 9 రౌండ్లలో లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కాగా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పోలింగ్ జరగగా.. ఇందులో మొత్తం 15,495 మంది ఓటును వినియోగించుకున్నారు.

Exit mobile version
Skip to toolbar