Rohit Sharma: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్.. సెహ్వాగ్ రికార్డ్ హిట్‌ మ్యాన్ బ్రేక్ చేస్తాడా..?

Rohit Sharma: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 16 నుంచి బెంగళూరులో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్‌కు ఇరు జట్లు తమ తమ జట్టులను కూడా ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఒక గొప్ప రికార్డును సృష్టించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ క్రికెట్‌లో తన షాట్లకు ప్రసిద్ధి చెందాడు. అందుకే అభిమానులు అతన్ని హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. కాబట్టి ఆ రికార్డ్ ఏమిటో మనం తెలుసుకుందాం.

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 5 సిక్సర్లు బాదితే సిక్సర్ కింగ్‌గా అవతరిస్తాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ 87 సిక్సర్లు కొట్టాడు. నిజానికి భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ పేరు మొదటి స్థానంలో ఉంది. టెస్టు క్రికెట్‌లో 104 మ్యాచ్‌లు ఆడి 91 సిక్సర్లు కొట్టాడు. అటువంటి పరిస్థితిలో రోహిత్ శర్మ ఐదు సిక్సర్లు కొట్టిన వెంటనే వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించగలడు. ఇప్పటికే వన్డే క్రికెట్‌, టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లోనూ సత్తా చాటే అవకాశం ఉంది.

భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు

  1. వీరేంద్ర సెహ్వాగ్ – 91 సిక్సర్లు
  2. రోహిత్ శర్మ – 87 సిక్సర్లు
  3. ఎంఎస్ ధోని – 78 సిక్సర్లు
  4. సచిన్ టెండూల్కర్ – 69 సిక్సర్లు
  5. రవీంద్ర జడేజా – 66 సిక్సర్లు
  6. టీమ్ ఇండియాకు న్యూజిలాండ్ సిరీస్ కీలకం

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ టీమ్ ఇండియాకు చాలా కీలకం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియా 3-0తో విజయం సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్ గెలవడం అంత తేలికైన విషయం కాదు, కాబట్టి ముందుగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం చాలా ముఖ్యం.