Site icon Prime9

Delhi Excise Policy Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం, 3000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ..

ED

ED

ED: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రును నిందితుల్లో ఒకరిగా పేర్కొంటూ ఈడీ  శనివారం కోర్టు ముందు తన మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.ఇండోస్పిరిట్స్ ప్రమోటర్ మహేంద్రుతో పాటు, ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. చార్జిషీటులో నిందితుల వాంగ్మూలాలు మరియు అనుబంధాలను కలిగి ఉన్న దాదాపు 3,000 పేజీలు ఉన్నాయని వారు తెలిపారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్లను చార్జ్ షీట్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫారసు మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ఇప్పటివరకు 169 సెర్చ్ ఆపరేషన్‌లు చేపట్టామని ఈడీ తెలిపింది.GNCTD చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (ToBR)-1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం-2009 మరియు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్-2010 యొక్క ప్రాథమిక ఉల్లంఘనలను చూపుతూ సీబీఐ విచారణకు సిఫార్సు చేయబడిందని అధికారులు చెప్పారు.

ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని ఈడీ అరెస్ట్ చేసింది. మహేంద్రుని ప్రశ్నించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 27న అరెస్టు చేసింది.సీబీఐ కూడా ఈ వారం ప్రారంభంలోనే ఈ కేసులో తొలి ఛార్జిషీటును దాఖలు చేసింది.

Exit mobile version
Skip to toolbar