Prime9

India-Pakistan war: భారత్, పాకిస్థాన్ యుద్ధానికి డేట్ ఫిక్స్.. సంచలన ట్వీట్..! పీఎం మోదీతో అజిత్ భేటీ

EX Pakistani High Commissioner sensational tweet India-Pakistan war Perhaps on 10-11 May: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాకిస్థాన్ దిగుమతులను నిషేధించింది. అంతకుముందు పాకిస్థాన్ వీసాలను సైతం రద్దు చేసింది.

 

అయితే, ఈ తరుణంలో రష్యాలో ఉన్న పాక్ రాయబారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని మహ్మద్ ఖలీద్ జమాలీ చెప్పాడు. కాగా, భారత్ దాడి చేస్తే పాక్ తిప్పికొడుతోందని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా, పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశాడు. ‘మే 10, 11 తేదీల్లో భారత్ తమ దేశంపై దాడి చేయొచ్చని పేర్కొన్నారు. రష్యా విక్టరీ డే మే 9వ తేదీన ఉంది. ఈ కార్యక్రమం తర్వాత దాడి జరిగే అవకాశం ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సంచనలంగా మారింది.

 

మరోవైపు, పీఎం ప్రధాని మోదీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ భేటీ అయ్యారు.ప్రస్తుతం సరిహద్దులో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై చర్చించారు. అయితే వీరిద్దరూ 48 గంటల్లో రెండోసారి భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కేంద్ర హోంశాఖ కూడా ఇవాళే సమావేశమైంది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే చేపట్టనున్న చర్యలపై ముందస్తుగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

 

Exit mobile version
Skip to toolbar