Prime9

Earthquake: పాకిస్తాన్ లో భూకంపం.. వణికిపోయిన జనం

Pakistan: పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. సాయంత్రం 4 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ ఫర్ సస్మాలజీ ప్రకటించింది. ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని ఛిత్రాల్ జిల్లాలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్స్ లో చోటుచేసుకున్న కదలికలతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అసలే పహల్గాం ఉగ్రదాడి అనంతరం యుద్ధ భయంతో పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటోంది. ఈ నేపథ్యంలోనే భూకంపం సంభవించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

కాగా పాకిస్తాన్ లో భూకంపాలు రావడం కాస్త సాధారణమైన విషయమే.. గత ఏప్రిల్ 30న కూడా పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. తాజా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టాలపై వివరాలు తెలియలేదు. కానీ కొంత ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. భూప్రకంపనలు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ దేశాలకు కూడా వ్యాపించాయి.

Exit mobile version
Skip to toolbar