Site icon Prime9

JEE Main Exams: ఏప్రిల్‌ 1 నుంచి జేఈఈ మెయిన్‌-2

JEE Main 2025 Exam Dates Released by NTA: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -2 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పరీక్షలను ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది. పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుండగా, మెయిన్‌-2 పరీక్ష షెడ్యూల్‌ను ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్‌ -2కు ఎప్‌సెట్‌ పరీక్షకు మధ్య 20 రోజులే ఉండనుంది.

Exit mobile version