Prime9

Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ అందుకే వదిలేశా.. కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

 

 

Virat Kohli: కింగ్ కోహ్లీ, పరుగుల వరదను పారించే మిషిన్ గన్. 19ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. పరుగుల వరదకు అతనో ఐకాన్.. సూపర్ పర్ఫామెన్స్ తో కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు టీమిండియాకు కెప్టెన్ గా, 9 సంవత్సరాలు ఆర్సీబీకి కెప్టెన్ గా చేశాడు.

 

 

టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ ఆర్సీబీకి మాత్రం కప్ తీసుకురాలేకపోయాడు. ఈ విషయంపై చాలా విమర్శల పాలయ్యాడు. తాజాగా ఓ పోడ్ కాస్ట్ లో మాట్లాడిన కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ పదవిని ఎందుకు వదిలాడన్న విషయంపై మొదటిసారి పెదవి విప్పాడు. తాను భారత కెప్టెన్ గా, ఆర్సీబీ కెప్టెన్ గా ఎంతో సంఘర్షణకు లోనైనట్లు తెలిపాడు.

 

 

తన క్రికెట్ కెరీర్ లో అత్యంత అల్లకల్లోల దశలలో ఇది ఒకటని అన్నాడు. 2016-2019 మధ్య టీమిండియా, ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు ఎంతో ఘర్షనకు లోనైనట్లు చెప్పాడు. ఇది తన కెరీర్ పై ప్రభావం చూపడంతో నాయకత్వ బాధ్యతలనుంచి తప్పుకున్నట్లు చెప్పారు.

 

 

IPL 2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కోహ్లీ. తరువాత T20I కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇదిలా ఉంటే, BCCI అతన్ని వన్డే కెప్టెన్ నుంచి తొలగించింది. అందుకు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వివరణ ఇచ్చారు.

 

 

కెప్టెన్సీ ఒత్తిడి తన ఆటపై ప్రభావం చూపినట్లు కోహ్లీ అంగీకరించాడు. తన ఆటనుంచి బయట ఉన్నట్లుగా, ఏమి చేయాలో తెలియని ఓ వింత ఆలోచనను కలిగి ఉండేవాడినని చెప్పాడు. అందులోనుంచి తొందరగా బయటపడ్డానని ఆటమీద దృష్టి పెట్టడానికి కెప్టెన్సీ పదవిని వీడానని అన్నాడు.

 

 

ఆర్సీబీని వీడటంపై తనకు రిగ్రేట్స్ లేవన్నాడు కోహ్లీ. తానను ప్రాంచేజీ ఇబ్బంది పెట్టలేదని చెప్పాడు. పరస్పర అంగీకారంతోనే తాను ఆర్సీబీ కెప్టెన్సీని వదిలినట్లు తెలిపాడు. టీమిండియా కోసం చాలా సిరీస్ లు గెలిచినట్లు గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. ఎప్పటికీ ఆర్సీబీ అనేది తనకు ఇల్లని గెలిచినా గెలవక పోయినా ముందుకు వెళ్లడం మానివేయనని అన్నాడు.

Exit mobile version
Skip to toolbar