Site icon Prime9

Kaleshwaram Saraswati Pushkaralu: కుంభమేళాను తలపిస్తున్న కాళేశ్వరం.. త్రివేణి సంగమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పుణ్య స్నానం!

Saraswati Pushkaralu 5th Day huge devotees ex minister mallareddy

Saraswati Pushkaralu 5th Day huge devotees ex minister mallareddy

Saraswati Pushkaralu 5th Day Huge Devotees: జయశంకర్ భూపాలపల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరం కుంభమేళాను తలపిస్తుంది. ఈ మేరకు సరస్వతి పుష్కరాలు ఐదోరోజు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు.. ఈ నెల 26 వరకు జరగనున్నాయి. పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచే వేలాదిగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి తరలివస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు తెల్లవారుజామునే చేరుకుంటున్నారు.

 

తాజాగా, మాజీ మంత్రి చామకుర మల్లారెడ్డి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వరం ముక్తిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు మల్లారెడ్డికి ఆశీర్వచనలు అందించారు. కాగా, కాళేశ్వరంలోని ప్రతి మూల కోణం భక్తులతో నిండిపోతోంది. ప్రధాన ఘాట్‌లు, స్నానాల ప్రాంతాలు, దేవాలయం పరిసరాలు జనసంద్రమయంగా మారాయి. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పుష్కర స్నానాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

 

Exit mobile version
Skip to toolbar