Robbery in Telangana Raj Bhavan Important Files Missing: తెలంగాణలోని రాజ్భవన్లో చోరీ జరిగింది. ఈ మేరకు హార్డ్డిస్క్లు మాయమయ్యాయి. రాజ్భవన్ సుధర్మ భవన్లో 4 హార్డ్డిస్క్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులో రూమ్ నుంచి హార్డ్డిస్క్లు అపహరణకు గురైనట్లు సీసీ ఫుటేజీలో సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న రాత్రి చోరి జరిగినట్లు నిర్ధారించారు. హెల్మెట్తో కంప్యూటర్ రూమ్లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. హార్డ్డిస్క్లలో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం.
అయితే, హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లిన శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్భవన్లో హార్డ్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండగా.. ఇటీవల తనతో పాటు చేసే ఓ మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేశాడు. ఆ తర్వాత మార్ఫింగ్ ఫోటోలను ఎవరో తనకు కావాలనే పంపిస్తున్నట్లు నమ్మబలికాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసింది శ్రీనివాస్ అని తేలింది. చివరికి అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. జాబ్ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల బెయిల్ మీద బయటకు రాగా.. సెక్యూరిటీని ట్రాప్ చేసి రాజ్ భవన్ లోపలికి వెళ్లాడు. మార్ఫింగ్ ఫోటోకు సంబంధించి ఆధారాలు లేకుండా చేయాలని హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లాడు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజీలో శ్రీనివాస్ను గుర్తించి అరెస్ట్ చేశారు.