TTD Serious Action on other Religion TTD Employees: తిరుమల భద్రతపై టీటీడీ ఫోకస్ చేసింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న గుడులలో తిరుమల ఒకటి. ఇప్పటికే తిరుమల రక్షనార్థం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. తిరుమల అంటే కేవలం రాష్ట్రానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రెస్టేజ్ తో కూడుకున్నది. ప్రపంచంలోని శ్రీవారి భక్తులు నిత్యం కొలుచుకునే వైకుంఠేశ్వడి సన్నిధిని మరింత పటిష్టం చేయనుంది టీటీడీ.
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం టీటీడీ చెర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి ఇందులో పాల్గొన్నారు. పలు కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగాంగనే యాంటీ డ్రోన్ టెక్నాటజీని తిరుమలలో వాడాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు తదుపరి అవసరమైన చర్యలు స్వేచ్చగా తీసుకోవచ్చని అధికారులను ఆదేశించారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులను బదిలీ చేయనున్నారు. ఇందుకుగాను వాలంటరీ రిటైర్మెంట్ తో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్దం చేస్తున్నారు.
తిరుమలలో మరింత పచ్చదనాన్ని పెంచడానికి చూస్తున్నారు. తిరుమల కొండల్లో ప్రస్తుతం 68 శాతం పచ్చదనం ఉందని దాన్ని 80 శాతం పెంచేందుకు రెడీ అవుతున్నారు. అంచెలంచెలుగా పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నామని టీటీడీ ఈరో శ్యామలారావు వెల్లడించారు. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన భోజనాన్ని అందించేందుకు బిగ్ క్యాంటిన్లు. జనతా క్యాంటీన్ల లైసెన్స్ ఫీజులను మంచి సంస్థలకు ఇవ్వాలని ఫైనల్ చేశారు. ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయనున్నారు.
తిరుచానూరు పద్మావతి ఆలయం, ఒంటిమిట్ట, కపిలతీర్థం, నాగాలాపురం, కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ది చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతోపాటే శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసిన తమిళ సినిమా డీడీ నెక్ట్స్ చిత్రబృందంపై చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.