Site icon Prime9

GST collection: ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ వసూలు

gst-collection

New Delhi: వరుసగా ఆరు నెలలుగా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్‌టీ ఆదాయాల కంటే 28 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని పేర్కొంది.

ఆగస్టులో వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,43,612 కోట్లు, అందులో సీజీఎస్టీ రూ.24,710 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.30,951 కోట్లు, ఐజీఎస్టీ రూ.77,782 కోట్లు, వస్తువుల దిగుమతి పై రూ.42,067 కోట్లు, సెస్ రూ.10,168 కోట్లు. వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.1,018 కోట్లతో సహా, ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.29,524 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.25,119 కోట్లు సెటిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత, కేంద్రం మొత్తం ఆదాయం రూ.54,234 కోట్లు, రాష్ట్రాలకు రూ.56,070 కోట్లుగా ఉన్నాయి.

గతేడాది ఆగస్టులో జీఎస్టీ రాబడులు రూ.1,12,020 కోట్లు. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 28 శాతం తక్కువ. ఈ నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 57 శాతం ఎక్కువ మరియు దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయం గత సంవత్సరం ఇదే నెల కంటే 19 శాతం ఎక్కువ.

Exit mobile version
Skip to toolbar