Basmati crop survey: APEDA అధ్వర్యంలో బాస్మతిపంట సాగు పై సర్వే

వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) 2022-2023 ఖరీఫ్ పంట సీజన్ కు సంబంధించి బాస్మతి పంట సర్వేను ప్రారంభించింది. కోవిడ్-19 పరిమితుల కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బాస్మతి పంట సర్వే జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 06:56 PM IST

Basmati crop survey: వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) 2022-2023 ఖరీఫ్ పంట సీజన్ కు సంబంధించి బాస్మతి పంట సర్వేను ప్రారంభించింది. కోవిడ్-19 పరిమితుల కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బాస్మతి పంట సర్వే జరుగుతోంది. బాస్మతి బియ్యం అనేది భౌగోళికంగా సూచించబడిన వ్యవసాయ ఉత్పత్తి, APEDA-అనుబంధ బాస్మతి ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (BEDF) ఈ సర్వేను నిర్వహిస్తోంది. తుది సర్వే నివేదికను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తారు.సర్వే నమూనా ప్రకారం, ఏడు బాస్మతి ఉత్పత్తి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరాలలో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన రైతుల సమూహం క్షేత్ర ఆధారిత మరియు ఉపగ్రహ చిత్రాల ఆధారంగాసర్వే నిర్వహించబడుతోంది.

BEDF ద్వారా బాస్మతి వరి సాగును ప్రోత్సహించడంలో APEDA రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా APEDA మరియు BEDF నిర్వహించే వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా ధృవీకృత విత్తనాల వాడకం, మంచి వ్యవసాయ పద్ధతులు మరియు పురుగుమందుల గురించి రైతులకు తెలియజేయబడుతుంది.