ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి ప్రత్యేకతలు

రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది.

గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది. పురాణ గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పౌరాణిక జంతువులు.. ఇలాంటివి ఆ శిల్పాలపై చెక్కారు.

కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణం అరుదు.

హైహీల్స్ వేసుకున్న మహిళ శిల్పం ప్రత్యేక ఆకర్షణ.

నేల నుంచి ఆరు అడుగులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై ఈ గుడి నిర్మించారు. పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడి నిర్మించారు. ఎర్ర ఇసుకతో నిర్మించిన  రాయి రంగు ఇప్పటికీ కోల్పోలేదు.

పక్కనే ఉన్న రామప్ప చెరువు, అందమైన తోటలు దీనికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా, ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించారు.

ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలోని నంది శిల్పం కూడా మిగతా చోట్ల కంటే భిన్నంగా ఉంటుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం