జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14 నుంచి వారాహితో ప్రచారం ప్రారంభించనున్నారు.

ఈసందర్భంగా పవన్ ధర్మపరిరక్షణ యాగం చేశారు.

కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ప్రారంభమయ్యే తొలి విడత వారాహి యాత్ర భీమవరం వరకూ సాగనుంది

యాగశాలలో ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా రుత్వికుల సమక్షంలో ఎంతో ఘనంగా పవన్ యాగం పూర్తిచేశారు

ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలో యాగం ప్రారంభించారు

రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ స్వయంగా ప్రారంభించారు

పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్ర ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు.

ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు పవన్ కళ్యాణ్

విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం