ఫెమినా మిస్‌ ఇండియా 2023 పోటీలు మణిపూర్‌ వేదికగా అట్టహాసంగా జరిగాయి.

ఈ మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా విజేతగా నిలిచింది. 

గతేడాది మిస్‌ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి అందాల కిరిటాన్ని నందినికి గుప్తాకు అలంకరించారు.

ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్‌ స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు.

నందినీ గుప్తా స్వస్థలం రాజస్థాన్‌లోని కోట ఆమె స్వస్థలం.

చిన్నప్పటి నుంచి చదువులో చాలా యాక్టివ్‌. సెయింట్ పాల్ సీనియర్ సెకండరీ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది.

ప్రస్తుతం లాలా లజపతిరాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చదువుతోంది నందిని.

10 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుందట నందిని. ఎప్పటికైనా ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందట.

ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులోనే తన కలసాకారమైందని తెగ సంబరపడిపోతోందీ అందాల రాణి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం