ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను రిలయన్స్కు విక్రయించే పథకానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ఆధారంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ 24,713 కోట్ల రూపాయల ఒప్పందానికి తన "ప్రతికూల పరిశీలన లేదన్ననివేదికను మంజూరు చేసింది.గత ఆగస్టులో ఈ విక్రయం జరగ్గా ఐదు నెలల తరువాత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ ఒప్పందాన్ని అనుమతించింది.
అయితే అమెజాన్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్తో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్తో పంచుకోవాలని సెబీ స్పష్టం చేసింది. అమెజాన్-ఫ్యూచర్ డీల్కు ఎన్సీఏఎల్టీ కూడా అనుమతించాల్సి ఉంటుంది. . ఈ పరిణామంపై అమెజాన్ కూడా స్పందించింది. ఈ విషయమై ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని పేర్కొంది. అంతేకాకుండా..స్టాక్ మార్కెట్ అనుమతులన్నీ సింగపూర్ ఆర్బిట్రేటర్ తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయిని స్పష్టం చేసింది.
లయన్స్తో డీల్కు సంబంధించి అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతంలో అమెజాన్తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందంలోని కొన్ని నిబంధనలను ఈ కొత్త డీల్ ఉల్లంఘిస్తోందనేది అమెజాన్ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో అమెజాన్ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేటర్నూ ఆశ్రయించింది. ఈ క్రమంలో తుది తీర్పు వెలువడే వరకూ రిలయన్స్తో డీల్ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆర్బిట్రేటర్ గత ఏడాది ఆక్టోబర్లో తీర్పు వెలువరించింది. అయితే.. రిలయన్స్తో ఒప్పందానికి సంబంధించినంత వరకూ సింగపూర్ ఆర్బిట్రేటర్ తీర్పుకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో డీల్ నిలిపివేత తీర్పును అమెజాన్ సంస్థ పలు లేఖల ద్వారా సెబీకి దృష్టికి కూడా తెచ్చింది.
ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను రిలయన్స్కు విక్రయించే పథకానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ఆధారంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ 24,713 కోట్ల రూపాయల ఒప్పందానికి తన "ప్రతికూల పరిశీలన లేదన్ననివేదికను మంజూరు చేసింది.గత ఆగస్టులో ఈ విక్రయం జరగ్గా ఐదు నెలల తరువాత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ ఒప్పందాన్ని అనుమతించింది.
అయితే అమెజాన్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్తో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్తో పంచుకోవాలని సెబీ స్పష్టం చేసింది. అమెజాన్-ఫ్యూచర్ డీల్కు ఎన్సీఏఎల్టీ కూడా అనుమతించాల్సి ఉంటుంది. . ఈ పరిణామంపై అమెజాన్ కూడా స్పందించింది. ఈ విషయమై ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని పేర్కొంది. అంతేకాకుండా..స్టాక్ మార్కెట్ అనుమతులన్నీ సింగపూర్ ఆర్బిట్రేటర్ తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయిని స్పష్టం చేసింది.
లయన్స్తో డీల్కు సంబంధించి అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతంలో అమెజాన్తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందంలోని కొన్ని నిబంధనలను ఈ కొత్త డీల్ ఉల్లంఘిస్తోందనేది అమెజాన్ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో అమెజాన్ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేటర్నూ ఆశ్రయించింది. ఈ క్రమంలో తుది తీర్పు వెలువడే వరకూ రిలయన్స్తో డీల్ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆర్బిట్రేటర్ గత ఏడాది ఆక్టోబర్లో తీర్పు వెలువరించింది. అయితే.. రిలయన్స్తో ఒప్పందానికి సంబంధించినంత వరకూ సింగపూర్ ఆర్బిట్రేటర్ తీర్పుకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో డీల్ నిలిపివేత తీర్పును అమెజాన్ సంస్థ పలు లేఖల ద్వారా సెబీకి దృష్టికి కూడా తెచ్చింది.
Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021