తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... నేడు ఆయన పుట్టిన రోజు సందర్భం గా ఆ గ్రామ ప్రజలు ఆయనకు వినూతనం గా శుభాకాంక్షలు తెలిపారు. తన అభిమాన నాయకునికి పచ్చపచ్చని శుభాకాంక్షలు చెప్పారు. ఆయన పుట్టిన రోజున ఊరంతా మొక్కలు నాటి స్పూర్తిగా నిలిచారు. ఆయన పుట్టిన రోజున సందర్భం గా ఆ గ్రామ ప్రజలు "హరీశ్ రావు అంటే మాకు అభిమానం. ఆయన మా బిడ్డ. ఆయన మా అన్న.. ఆయన మలో ఒకరు. మా ఊరిని దత్తత తీసుకున్న మా కుటుంబ సభ్యుడాయన. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి అని స్ఫూర్తి నింపిన హరీశ్ రావు గారి పుట్టిన రోజున మా ఇంట్లో మొక్క నాటి మేము స్ఫూర్తిగా నిలుస్తాం. ఆయన ఆలోచనను ఆచరణలో చూపెడతాం. మంత్రి దత్తత గ్రామం స్ఫూర్తిని చాటుతాం" అని చెప్పి.. కుటంబ సమేతం గా మొక్కలు నాటారు. గ్రామంలో 300 ఇళ్లు ఉంటే 300 ఇండ్లలో ఇంటికో జామ , ఇతర పండ్ల మొక్క నాటారు. మా హరీశ్ అన్నకు ఇచ్చే ఉడుత భక్తిగా ఒక మొక్క బహుమనం అని సంతోష పడుతున్నాం అంటూ వారు ఆనందం గా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి దేవయ్య, ఉప సర్పంచ్ వంక దేవయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అన్నీ కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు అందరూ కలసి పాల్గొన్నారు.
హరీష్ రావు ఎపుడు సిద్ధిపేట గురించి మాట్లాడినా. ఓ మాట అంటుంటారు. సిద్ధిపేట తన కుటుంబమని... తానూ ఎక్కడ ఉన్న మనసులో సిద్ధిపేటనే తలుస్తానని అంటుంటారు. పక్షి ఎక్కడ ఉన్న రాత్రికి గూటికే చేరుతుందని... నేను ఎక్కడ ఉన్నా రాత్రికి మాత్రం సిద్దిపేట ప్రజల గూటికే చేరుకుంటా అని ఆయన చెబుతుంటారు. అలాంటి నాయకుడికి ఇబ్రహీంపూర్ వాసులు పచ్చని మొక్కతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం స్ఫూర్తిదాయకం గా ఉంది.