కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని చారిత్రక కట్టడాల్లోని ప్రార్థనాలయాలు నేటి నుంచి మళ్లీ తెరచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉండే 3,691 చారిత్రక కట్టడాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 17 నుంచి మూసేశారు. ప్రార్థనాలయాలతో సంబంధం ఉన్న మొత్తం 820 చారిత్రక కట్టడాలను ముందుగా తెరవనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలోని వేయి స్తంభాల ఆలయం, ములుగు జిల్లాలోని రామప్ప, జోగులాంబ గద్వాల జిల్లాలోని నవబ్రహ్మ, పాపనాశి, సంగమేశ్వర ఆలయాలు కూడా సోమవారం నుంచి భక్తుల దర్శనాల కోసం తెరుచుకోనున్నాయి.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ ఉప కార్యదర్శి అజయ్ యాదవ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని చారిత్రక కట్టడాల్లోని ప్రార్థనాలయాలు నేటి నుంచి మళ్లీ తెరచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉండే 3,691 చారిత్రక కట్టడాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 17 నుంచి మూసేశారు. ప్రార్థనాలయాలతో సంబంధం ఉన్న మొత్తం 820 చారిత్రక కట్టడాలను ముందుగా తెరవనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలోని వేయి స్తంభాల ఆలయం, ములుగు జిల్లాలోని రామప్ప, జోగులాంబ గద్వాల జిల్లాలోని నవబ్రహ్మ, పాపనాశి, సంగమేశ్వర ఆలయాలు కూడా సోమవారం నుంచి భక్తుల దర్శనాల కోసం తెరుచుకోనున్నాయి.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ ఉప కార్యదర్శి అజయ్ యాదవ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
27 Jan 2021
27 Jan 2021