Home / తెలంగాణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపటిదినం ప్రధాని రామగుండం రానున్న క్రమంలో కిషన్ రెడ్డి భాజపా కార్యాలయంలో మీడియాతో సమావేశమైనారు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల క్యాసినో, వన్యప్రాణుల పెంపకంతో వార్తల్లో కెక్కిన చీకోటి ప్రవీణ్ రాజా సింగ్ ను కలిసారు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలోని గ్రానైట్ కంపెనీ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై జరిపిన సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని ఈడీ అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయన్నారు.
భాగ్యనగరంలో తెల్లారితే చాలు, ఉరుకులు పరుగులు మీద తమ తమ గమ్యస్ధానాలకు చేరుకొనే సామాన్యులు, ఉద్యోగుల రద్దీతో ప్రధాన మార్గాలు కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో ప్రజలు రోడ్డు, మెట్రో రైలు సేవలను అధికంగా వినియోగిస్తుంటారు. అయితే నేడు ఉదయం చోటుచేసుకొన్న సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు సేవలు ఆగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు.
తెలంగాణ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఘాటు విమర్శులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోనే అతిపెద్ద స్కాం అని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో రేపు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ నెల 12న రెండో శనివారం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్లో ప్రారంభమయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జహీరాబాద్లో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
హైదరాబాద్ లో ఈనెల 19, 20వ తేదీల్లో మరియు వచ్చేనెల 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్ పోటీలకు హుస్సేన్సాగర్ వేదిక కానుంది.