కరోనా కారణంగా ఇన్నాళ్లు స్కూళ్ళు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా, తిరిగి స్కూళ్లను తెరవడానికి రంగం సిద్ధమైంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్ర రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి స్కూళ్ళను తిరిగి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేసారు.
ఈ నెల 25 లోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఒకటవ తరగతి నుంచి, తొమ్మిది ఆ పై తరగతుల వారికి కూడా ఇక పై పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతిలో విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే, ఈ విషయమై పేరెంట్స్ కమిటీతో కూడా చర్చలు జరపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అటెండన్స్ విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి ఉండదని సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేసారు.
పాఠశాలలతో పాటు, హాస్టల్స్, గురుకుల పాఠశాలలను కూడా తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే, గురుకుల పాఠశాలల వద్ద వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
కరోనా కారణంగా ఇన్నాళ్లు స్కూళ్ళు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా, తిరిగి స్కూళ్లను తెరవడానికి రంగం సిద్ధమైంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్ర రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి స్కూళ్ళను తిరిగి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేసారు.
ఈ నెల 25 లోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఒకటవ తరగతి నుంచి, తొమ్మిది ఆ పై తరగతుల వారికి కూడా ఇక పై పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతిలో విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే, ఈ విషయమై పేరెంట్స్ కమిటీతో కూడా చర్చలు జరపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అటెండన్స్ విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి ఉండదని సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేసారు.
పాఠశాలలతో పాటు, హాస్టల్స్, గురుకుల పాఠశాలలను కూడా తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే, గురుకుల పాఠశాలల వద్ద వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021