Hyderabad: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాగార్జున్ సాగర్ లో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ నుంచి మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి హెలికాప్టర్లో కేటీఆర్ బయల్దేరనున్నారు.
ముందుగా పెద్దవూర మండలం సుంకిశాల పరిధిలో హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాల సరఫరా కోసం ఇంటెక్వెల్ వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అనంతరం హాలియాకు చేరుకుని హాలియా, నందికొండకు సంబంధించి రూ.56కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లపై సమీక్షించారు.
Hyderabad: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాగార్జున్ సాగర్ లో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ నుంచి మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి హెలికాప్టర్లో కేటీఆర్ బయల్దేరనున్నారు.
ముందుగా పెద్దవూర మండలం సుంకిశాల పరిధిలో హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాల సరఫరా కోసం ఇంటెక్వెల్ వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అనంతరం హాలియాకు చేరుకుని హాలియా, నందికొండకు సంబంధించి రూ.56కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లపై సమీక్షించారు.
Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022