బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని, మాదాల సిద్దార్థ అండ్ గ్యాంగ్ను అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అఖిలప్రియకు మాదాల సిద్దార్థ కిడ్నాప్ గ్యాంగ్ను సప్లై చేశాడని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ మాదాల సిద్దార్థ విజయవాడలో ఈవెంట్ మేనేజర్. అతడు తన స్విఫ్ట్ కారును కూడా కిడ్నాప్కు ఇచ్చాడు. కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ అయ్యారు. సిద్దార్థకు అఖిలప్రియ రూ.5 లక్షల సుపారీ ఇచ్చారు. మిగతా 20 మందికి తలా రూ.25 వేలు ఇచ్చారు. అడ్వాన్స్గా సిద్దార్థకు రూ.74 వేలు ఇచ్చారు.
ఫోరమ్ మాల్ వద్ద ఎట్హోమ్లో కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాపర్లకు గుంటూరు శ్రీను దుస్తులు సమకూర్చాడు. మొయినాబాద్లో బాధితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. స్టాంప్ పేపర్లను మల్లికార్జున్ సంపత్ అరేంజ్ చేశాడు. జగత్ విఖ్యాత్, భార్గవ్రామ్ పేర్లపై ఖాళీ పత్రాలు ఉన్నాయి. కిడ్నాప్లో విఖ్యాత్ ఇన్నోవా కారు ఏపీ 21 సీకే 2804 వినియోగించారు. విఖ్యాత్ కారులో భార్గవ్రామ్, మరో నలుగురు నిందితులు ఉన్నారు. భార్గవ్రామ్, విఖ్యాత్రెడ్డి, చంద్రహాస్ ప్రధాన నిందితులు. శ్రీను, భార్గవ్రామ్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని తెలిపారు.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తొలుత ఏ-2గా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు ప్రధాన నిందితురాలిగా మార్చారు. ఏ-1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ-2గా మార్చారు. ముందుగా అఖిలప్రియపై 448, 419, 341, 342, 506, 366, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత మరో రెండు సెక్షన్లు ఐపీసీ 147, 385 జోడించారు. మరిన్ని వార్తలు చదవండి
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని, మాదాల సిద్దార్థ అండ్ గ్యాంగ్ను అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అఖిలప్రియకు మాదాల సిద్దార్థ కిడ్నాప్ గ్యాంగ్ను సప్లై చేశాడని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ మాదాల సిద్దార్థ విజయవాడలో ఈవెంట్ మేనేజర్. అతడు తన స్విఫ్ట్ కారును కూడా కిడ్నాప్కు ఇచ్చాడు. కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ అయ్యారు. సిద్దార్థకు అఖిలప్రియ రూ.5 లక్షల సుపారీ ఇచ్చారు. మిగతా 20 మందికి తలా రూ.25 వేలు ఇచ్చారు. అడ్వాన్స్గా సిద్దార్థకు రూ.74 వేలు ఇచ్చారు.
ఫోరమ్ మాల్ వద్ద ఎట్హోమ్లో కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాపర్లకు గుంటూరు శ్రీను దుస్తులు సమకూర్చాడు. మొయినాబాద్లో బాధితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. స్టాంప్ పేపర్లను మల్లికార్జున్ సంపత్ అరేంజ్ చేశాడు. జగత్ విఖ్యాత్, భార్గవ్రామ్ పేర్లపై ఖాళీ పత్రాలు ఉన్నాయి. కిడ్నాప్లో విఖ్యాత్ ఇన్నోవా కారు ఏపీ 21 సీకే 2804 వినియోగించారు. విఖ్యాత్ కారులో భార్గవ్రామ్, మరో నలుగురు నిందితులు ఉన్నారు. భార్గవ్రామ్, విఖ్యాత్రెడ్డి, చంద్రహాస్ ప్రధాన నిందితులు. శ్రీను, భార్గవ్రామ్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని తెలిపారు.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తొలుత ఏ-2గా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు ప్రధాన నిందితురాలిగా మార్చారు. ఏ-1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ-2గా మార్చారు. ముందుగా అఖిలప్రియపై 448, 419, 341, 342, 506, 366, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత మరో రెండు సెక్షన్లు ఐపీసీ 147, 385 జోడించారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
06 Mar 2021
05 Mar 2021
09 Mar 2021
08 Mar 2021
08 Mar 2021