తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రము లో అన్ని జలాశయాలు నిండుకున్నాయి. అన్నిచోట్లా వరద నీరు ఉద్ధృతంగా ఉంది. ఈ నేపధ్యంలో నాగార్జున సాగర్ వద్ద కూడా వరద పోటెత్తుండడంతో, అక్కడ 16 గేట్లను ఎత్తివేశారు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తతం సాగర్ లో ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులుగా ఉంది. ప్రస్తుతం సాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,70,903 క్యూసెక్కులుగా ఉంది. నీటి నిల్వ 305.8416 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312. 0405 టీఎంసీలుగా ఉంది. ఈ పరిస్థితి లో అక్కడి అధికారులు సాగర్ లోని 3,37,088 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలివేస్తున్నారు.
అయితే, ఆ కృష్ణమ్మ పరవళ్లతో ఆ ప్రాంతం బహు సుందరంగా ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో అక్కడి ప్రాంతంలో నీటి పరవళ్లను వీక్షించడానికి ప్రజలెవరికి అనుమతులు ఇవ్వలేదు. అక్కడ పర్యాటకులు గుమికూడితే, కరోనా విజృంభించే ప్రమాదం ఉన్నందున ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. అలాగే, జలాశయం పరిధిలో దిగువన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఈ జలాలన్నీ నాగార్జున సాగర్ వద్దకు చేరుతున్నాయి. మరిన్ని వార్తలు చదవండి.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రము లో అన్ని జలాశయాలు నిండుకున్నాయి. అన్నిచోట్లా వరద నీరు ఉద్ధృతంగా ఉంది. ఈ నేపధ్యంలో నాగార్జున సాగర్ వద్ద కూడా వరద పోటెత్తుండడంతో, అక్కడ 16 గేట్లను ఎత్తివేశారు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తతం సాగర్ లో ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులుగా ఉంది. ప్రస్తుతం సాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,70,903 క్యూసెక్కులుగా ఉంది. నీటి నిల్వ 305.8416 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312. 0405 టీఎంసీలుగా ఉంది. ఈ పరిస్థితి లో అక్కడి అధికారులు సాగర్ లోని 3,37,088 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలివేస్తున్నారు.
అయితే, ఆ కృష్ణమ్మ పరవళ్లతో ఆ ప్రాంతం బహు సుందరంగా ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో అక్కడి ప్రాంతంలో నీటి పరవళ్లను వీక్షించడానికి ప్రజలెవరికి అనుమతులు ఇవ్వలేదు. అక్కడ పర్యాటకులు గుమికూడితే, కరోనా విజృంభించే ప్రమాదం ఉన్నందున ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. అలాగే, జలాశయం పరిధిలో దిగువన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఈ జలాలన్నీ నాగార్జున సాగర్ వద్దకు చేరుతున్నాయి. మరిన్ని వార్తలు చదవండి.
Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
21 Apr 2021
20 Apr 2021
19 Apr 2021
21 Apr 2021