Home / ys sharmila
తాను దేన్నయినా ఎదుర్కొనేందుకుసిద్ధంగా ఉన్నానని, బీజేపీతో కుమ్మక్కైన వైఎస్సార్సీపీ, టీడీపీపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారా అంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు.శనివారంఒంగోలులోప్రకాశంజిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షా సమావేశంలోపాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత, ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే తాను ఆంధ్రప్రదేశ్కి వచ్చానన్నారు.
వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి సీఎం జగనే కారణమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దీనికి తన అమ్మ విజయమ్మ, ఆ దేవుడే సాక్ష్యమని చెప్పారు. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్దాయి విస్తృత స్దాయి సమావేశంలో వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు తన రాష్ట్ర పర్యటనను మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా శ్రీకాకుళం చేరుకున్న ఆమె ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి బస్సులో ప్రయాణించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. ఈ నెల 18న తన కుమారుడు రాజారెడ్డి- అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్కి, ఫిబ్రవరి 17న జరుగబోయే ఎంగేజ్మెంట్కి రావాలని చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చెప్పారు.
కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని.. కావాలంటే జాతీయ స్థాయిలో పదవి ఇచ్చుకోండని ఆయన సూచించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిల ఏపీలో ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు.
వైఎస్ షర్మిల మొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ నెల 18న జరగనున్న తన కుమారుడి నిశ్చితార్దానికి రేవంత్ రెడ్డిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి షర్మిలను సాదరంగా ఆహ్వనించి ముచ్చటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన మద్దతును తెలిపారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగనుందని షర్మిల ప్రకటించారు.
వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలతోనే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టేశారు.