Home / Case Registered
నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సైబరాబాద్ పరిధిలో సన్బర్న్ పేరిట నిర్వహించ తలపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షో, సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33, 34, 35 సర్వ్ నెంబర్ లోగల 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.
కేరళలో ఆదివారంనాడు జరిగిన వరుస పేలుళ్ల ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక విద్వేష వ్యాప్తికి, ఇరు వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
అత్యవసర పరిస్ధితుల్లో ప్రయాణీకుల పట్ల వినయంగా జాగ్రత వహించాలి. లేని పక్షంలో వ్యక్తిగత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకొనింది.
హైకోర్టు ఉత్తర్వులను సైతం పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా అనుకొన్నది వారు చేసేస్తున్నారు. దీంతో రెండు పబ్బుల పై హైదరాబాదు పోలీసులు కేసులు నమోదు చేశారు.
కేరళలోని కొల్లాంలో ఆదివారం జరిగిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ముందు తన కుమార్తె బ్రాను తొలగించమని ఒత్తిడి చేసారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పరీక్షా కేంద్రమైన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వద్ద భద్రతా తనిఖీల్లో మెటల్ హుక్స్ బీప్ కావడంతో బాలికను తన బ్రాను తొలగించమని అడిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.